Crime News: చిన్నకొడుకుతో కలిసి పెద్ద కొడుకుని చంపిన తల్లి.. గొంతుకు చీరను చుట్టి కడుపులో..

హైదరాబాద్ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కామాక్షిపురంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కె.శోభ తన చిన్నకుమారుడితో కలిసి పెద్ద కుమారుడు మురళిని హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న మురళి గొంతుకు చీరను చుట్టి కడుపులో పిడిగుద్దులు గుద్ది చంపేసినట్లు తెలుస్తోంది.

Crime News: చిన్నకొడుకుతో కలిసి పెద్ద కొడుకుని చంపిన తల్లి.. గొంతుకు చీరను చుట్టి కడుపులో..
New Update

Hyderabad: ఓ మహిళ కన్నతల్లి ప్రేమకు మచ్చతెచ్చింది. చిన్న కుమారుడితో కలిసి తన పెద్ద కుమారుడిని హతమార్చింది. ఈ దారుణమైన సంఘటన హైదరాబాద్ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కామాక్షిపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామాక్షిపురానికి చెందిన కె.శోభ తన ఇద్దరి కుమారులతో కలిసి ఇక్కడే నివాసం ఉంటుంది. పెద్ద కుమారుడు మురళి, చిన్న కుమారుడు మనోహర్‌. వీరి తండ్రి కుమార్‌ ఈ నెల 8వ తేదీన మృతి చెందాడు.

Also Read: ఆ కక్షతోనే జగన్ పై దాడి చేశారు: కొడాలి నాని

అయితే, పెద్ద కుమారుడు మురళి ఐదవ రోజు తండ్రి ఆస్తికలు కలిపి వచ్చిన తరువాత స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో మురళి దాదాపు రెండు గంటల పాటు కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఎంత సర్దిచెప్పినా గొడవ ఆపకపోవడంతో కన్నతల్లి విసుగుచెందింది. చిన్నకుమారుడు మనోహర్‌తో కలిసి మురళి చేతులు, కాళ్లను కట్టేసి గొంతుకు చీరను చుట్టి కడుపులో పిడిగుద్దులు గుద్ది చంపేశారు.

Also Read: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!

అయితే, మరుసటి రోజు ఏమీ తెలియనట్టుగా ఏడుస్తూ.. మురళి రాత్రి నిద్రలో చనిపోయడాని ఏడ్వడం మొదలుపెట్టారు. కాని, రాత్రి గొడవ జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకున్న మురళి స్నేహితులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మురళి పెద్దనాన్న శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe