Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి..

Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!
New Update

Warangal Road Accident: వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాగా,వరంగల్ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళుతుండగా.. తొర్రూర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు ఊరూరు తిరిగి తేనె అమ్మే వారిగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

వర్థనపేట సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అది రాజస్థాన్ కు చెందిన లారీ కాగా, డ్రైవర్ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు!

#warangal-road-accident #warangal-crime-news #warangal-news #warangal-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe