Bhadrachalam: భద్రాచలంలో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి ఏం చేశారంటే? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించిన ఓ ఆసుపత్రి సిబ్బంది శిశువును వేరే మహిళకు విక్రయించినట్లు తెలుస్తోంది. తల్లి పాలు లేక శిశువు అనారోగ్యం బారిన పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 02 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Bhadrachalam: అమ్మతనాన్ని పురిట్లోనే చంపేశారు ఓ ఆసుపత్రి సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి విక్రయించినట్లు తెలుస్తోంది. తల్లి పాలు లేక శిశువు అనారోగ్యం బారిన పడింది. చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి శిశువును తీసుకుని వెళ్లారు కొనుగోలు చేసిన మహిళ. సంబంధిత డాక్టర్ శిశువు గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. Also Read: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. రూ. 2 లక్షల 50వేలకు శిశువుని భద్రాచలంలోని ఓఆసుపత్రి సిబ్బంది విక్రయించినట్లు సమాచారం. శిశువు విక్రయం కోసం పురిట్లోనే శిశువు చనిపోయిందంటూ మరణ ధృవీకరణ పత్రంను ఆసుపత్రి సిబ్బంది తల్లికి అందజేసినట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు శిశువుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా శిశుగృహకు తరలించారు. అయితే, విషయం బయటికి రాకుండా ఐసీడీఎస్ అధికారులు గోప్యత పాటిస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: ఈ రోజే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణ సభ #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి