Crime News: నాలుగేళ్ల కొడుకును కొట్టి చంపిన కసాయి తండ్రి..!

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కొడుకును కసాయి తండ్రి కొట్టి చంపాడు. ముస్తకీమ్ అనే చిన్నారిపై సవతి తల్లి చాడీలు చెప్పడంతో తండ్రి ఇమ్రాన్ బాబును చావబాదాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime News: నాలుగేళ్ల కొడుకును కొట్టి చంపిన కసాయి తండ్రి..!

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో పండుగ రోజు దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కొడుకు ముస్తకీమ్ ను కసాయి తండ్రి కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ముస్తకీమ్ ఒంటిపై గాయాలను అమ్మమ్మ మస్తాన్ బీ గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కళాశాల రహదారిలో ఎలక్ట్రీషియన్ ఇమ్రాన్ నివాసం ఉంటున్నాడు. ముస్తకీమ్ పుట్టిన నాలుగు రోజులకే తల్లి మృతి చెందింది.

Also Read: వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ స్యూస్.. రూ. 10 వేల పారితోషికం..!

దీంతో, రూబీనా అనే యువతిని ఇమ్రాన్ అలీ రెండవ వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి రోజు ముస్తకీమ్ పై చాడీలు చెప్పడంతో రోజు ముస్తకీమ్ ను తండ్రి చావబాదేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలల క్రితం కన్న కొడుకు ముస్తకీమ్ ను తండ్రి ఇమ్రాన్ అలీ కొట్టాడని.. దాంతో ఆ బాబు చెయ్యి విరిగినా వైద్యం కూడా చేయించలేదని తెలుస్తోంది.

Also Read: జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!

తాజాగా, నిన్న రాత్రి ఇమ్రాన్ మరోసారి చావబాదడంతో ముస్తకీమ్ ఆపస్మారకస్థిలోకి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ముస్తకీమ్ అమ్మమ్మ ఖననం చేసేందుకు వెళుతున్న తండ్రిని నీలదీసింది. బట్టలు విప్పి చూడగా ఒంటిపై గాయాలు కనిపించాయి. నిర్ఘాంతపోయిన అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు