ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కేవలం తుమ్మాడనే కారణంతో ఓ వ్యక్తిని చితకబాదారు. చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన బొందెల సత్యనారాయణ కుటుంబం ఈనెల 13న కారులో ఓ శుభకార్యానికి బయలుదేరుతుండగా…అదే వీధిలో ఉన్న పప్పుల వీరభద్రం తన ఇంట్లోనే కూర్చుని తుమ్మాడు. అదే సమయంలో బొందె సత్యనారాయణ కారు వీరభద్రం ఇంటి ముందుకు వచ్చింది. తాము కారులో శుభకార్యానికి వెళ్తుండగా అపశకునంగా తుమ్మాడంటూ వీరభద్రాన్ని సత్యనారాయణ కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దారుణంగా దూషించారు.
పూర్తిగా చదవండి..తుమ్మినందుకే కొడతారా? ఇదెక్కడి పైశాచికానందం..!!
ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తుమ్మినందుకే ఓ వ్యక్తిని పొట్టు పొట్టుకొట్టారు. మూడనమ్మకాలను నమ్మి సాటి మనిషిని అత్యంత దారుణంగా చితకబాదారు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా వ్యక్తి తుమ్మాడని ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో సదరు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Translate this News: