Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై బ్లేడుతో దాడి.!

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!
New Update

Guntur: తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి మూడేళ్లుగా హాస్టల్‌లో ఉంటూ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో యువతి హాస్టల్‌లోనే ఉంది.

Also Read: వైసీపీ వెర్రి కుక్కలు.. వీరి అవినీతికి జైల్లు కూడా సరిపోవు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

ఈ క్రమంలో హాస్టల్‌లో ఉన్న యువతితో మాట్లాడాలని యువకుడు క్రాంతి కిందికి రావాలని పిలిచాడు. తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఉందని యువతిని కోరాడు. అయితే, దీనికి ఆమె నిరాకరించింది. ఇక ఆగ్రహానికి లోనైనా యువకుడు క్రాంతి తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. ఇంటర్ నుంచి క్రాంతికి యువతికి పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ నిరాకరించిందనే యువతిపై క్రాంతి దాడికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన క్రాంతిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

#guntur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe