దేశవ్యాప్తంగా చైనీస్ లోన్ యాప్స్ వేధింపులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక చోట రోజుకు ఎవరో ఒకరు ఈ వేధింపుల ధాటికి బలైపోతున్నారు. తాజాగా బెంగళూరు నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాలహళ్లికి చెందిన తేజ అనే కుర్రాడు యలహంకలోని నిట్టే మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. తేజ తన అవసరాల కోసం ‘స్లైస్ అండ్ కిస్’ అనే లోన్ యాప్ నుంచి కొంతమేర రుణం తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడంలో జాప్యం జరగడంతో ఏజెంట్ల వేధింపులు తీవ్రం అయ్యాయి.
పూర్తిగా చదవండి..అమ్మ, నాన్న క్షమించండి.. లోన్ యాప్స్ ఆగడాలతో 22ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం
చైనా లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కలెక్షన్ ఏజెంట్లు మరి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రుణం చెల్లించడం ఆలస్యం అయితే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అంతేకాకుండా పర్సనల్ ఫొటోలు మార్ఫింగ్ చేసి లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరి దౌర్జన్యాలు తట్టుకోలేక ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.
Translate this News: