Jobs in Indian Railways : రైల్వేలో ఉద్యోగాల(Railway Jobs) జాతర మొదలైంది. వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్(Notification) వేసింది. రైల్వే జాబ్ గోల్గా పెట్టుకున్నవాళ్ళందరికీ ఇదే మంచి అవకాశం అంటోంది రైల్వే శాఖ. ట్రైన్ డ్రైవర్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Recruitment Board) ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఫిబ్రవరి 19వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవాలి. దేశ వ్యాప్తంగా మొత్తం 5,696 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది రైల్వేశాఖ. అప్లై చేసిన తర్వాత అన్ని అర్హతలు ఉండి జాబ్ వస్తే మొదటి నెల నుంచే 19,900 జీతం ఉంటుంది. ఇది తరువాత గరిష్టంగా 63,200 వరకు పెరుగుతుంది.
పూర్తిగా చదవండి..Railway Jobs : రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.
రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నారా...నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిటింగా...ఇదిగో అయితే ఇది మీ కోసమే. ఇండియన్ రైల్వేశాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది. ఏకంగా 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Translate this News: