అలిపిరి కాలినడక మార్గంలో నాలుగో చిరుత బోనులో చిక్కింది. ఎట్టకేలకు అనేక వ్యయప్రయాసాల అనంతరం నాలుగో చిరుత చిక్కింది. ఆగష్టు 15నే ఈ నాలుగో చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించింది. ఆగష్టు 15 నుంచి నిరంతరంగా ఆపరేషన్ చిరుత కొనసాగించారు. ఇక నాలుగో చిరుత కూడా చిక్కడంతో నేటితో నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతల బెడదకు చెక్ పడిందని అంతా భావిస్తున్నారు. నిన్న రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో 7వ మైలు రాయి దగ్గర చిరుతపులి బోనులో చిక్కింది. దీంతో.. ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
Big Breaking: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!
తిరుమల కొండపై ఆపరేషన్ చిరుత ముగిసింది. ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి తర్వాత టీటీడీ అప్రమత్తం అవ్వడం.. వరుస పెట్టి మూడు చిరుతలను బోనులో బంధించడం చకచకా జరిగిపోయాయి. గత జూన్ 24న మొదటి చిరుత, ఆగస్ట్ 14న రెండో చిరుత, ఆగస్ట్ 17న మూడో చిరుత చిక్కగా..తాజాగా నాలుగో చిరుత కూడా బోనులో పడింది.
Translate this News: