తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాహితీ ఫార్మాలో పేలుడు ఘటన, శంషాబాద్ ఆటోమొబైల్ షాపులో మంటలు, విశాఖ తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాద ఘటనలు మరవకముందే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగడంతో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో గోదాంకు అగ్నికిలలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు తోడు దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరియ్యారు. చుట్టుపక్కన ఇళ్లలో ఉంటున్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. అటు ప్లాస్టిక్ పరిశ్రమలో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. షాట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Fire Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు.. నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు..!
తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాహితీ ఫార్మాలో పేలుడు ఘటన, శంషాబాద్ ఆటోమొబైల్ షాపులో మంటలు, విశాఖ తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాద ఘటనలు మరవకముందే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అయితే ప్లాస్టిక్ పరిశ్రమలో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. షాట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

Translate this News: