‘కనపడిన వాళ్లందరికి కాళ్లు కడుగుతారా’..? ‘ఆ కాళ్లు మూత్రం బాధితుడివి కాదా’..? ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలతో బీజేపీపై కాంగ్రెస్ సోషల్మీడియాలో మండిపడుతోంది. మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో గిరిజనుడి ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా..ఈ కేసులో రోజుకో కొత్త వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ కేసులో బాధితుడిగా భావిస్తోన్న దశమత్ రావత్ మాట్లాడిన ఓ వీడియో వైరల్గా మారింది. సోషల్మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఎక్కువగా షేర్ చేసిన ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు అయోమయంలో పడ్డారు. అసలు ప్రవేశ్ శుక్లా మూత్రం పోసింది తనపై కాదు అని.. తనలో అలా బలవంతంగా సంతకం పెట్టించారంటూ ఈ వీడియోలో రావత్ చెప్పడం కనిపించింది. దీంతో సీఎం కాళ్లు కడిగింది అసలు బాధితుడికి కాదని.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అయితే ఈ వీడియోలో అసలు నిజమెంతా..?
పూర్తిగా చదవండి..Fact Check: గిరిజనుడి ముఖంపై మూత్రం ఘటనలో అనేక వార్తలు చక్కర్లు..అసలు నిజమేంటి..?
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో గిరిజనుడి ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనపై దుమారం చెలరేగుతూనే ఉంది. తాజాగా వీడియోలో ఉన్నది తాను కాదు అని బాధితుడిగా భావిస్తోన్న రావత్ చెప్పడం సంచలనం సృష్టించింది. అయితే వీడియోని ట్రిమ్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
Translate this News: