ఉత్తరాది రాష్ట్రాల్లోని యుమున నదితో పాటు ఇతర నదులు, వాగులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పలు పట్టణాలు, నగరాలు జలమయమయ్యాయి. సహాయ చర్యల కోసం అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దింపారు. హిమాచల్లో పరిస్థితి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వరద ఉధృతికి కొండచరియలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. పర్యాటక ప్రదేశమైన మనాలీలో చిక్కుకుపోయిన 29 మందిని ఎన్టీఆర్ఎఫ్, పోలీసులు కాపాడారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 400 మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..వరదలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, భయాందోళనలో తల్లిదండ్రులు
ఓ పక్క భారీ వర్షాలు, మరోపక్కా ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్నారు. వర్ష బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు కసోల్లో చిక్కుకున్నారు. వరదల్లో నలుగురు తెలుగు ఆర్కిటెక్ట్ విద్యార్థులు చిక్కుకున్నారు. నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా వారి ఫోన్లు పనిచేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Translate this News: