Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒడిశాలోని బహనాగా మార్కెట్ సమీపంలో జూన్ 2న మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 295 మంది మృతి చెందారు. దాదాపు వంద మంది గాయపడ్డారు. దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, ఘోరమైన రైలు ప్రమాదంగా ఈ ఘటన నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇంకా 29 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అనాథశవాలుగు గుర్తించి ఐదు కంటైనర్లలో ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచారు. 266 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..శవాలు ఎవరివో.. అభాగ్యులెవరో.. ఈ 29మృతదేహాల కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 239మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్నా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఆ మృతదేహాలు ఇంకా మార్చురీలో ఉన్నాయి.
Translate this News: