New MP's In Lok Sabha: పార్లమెంట్‌లోకి 280 కొత్త ఎంపీలు

తాజా లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీనటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. యూపీ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు.తెలంగాణ నుంచి 10, ఏపీ నుంచి 13 మంది ఉన్నారు.

New Update
Parliament Sessions: ఎల్లుండి నుంచి లోక్‌సభ సమావేశాలు షురూ

New MP's In Lok Sabha: 2024 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్నవారే ఎక్కువ ఉన్నారు. ఈ సారి ఏకంగా 280 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీనటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నేత కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. యూపీ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు. కొత్తగా లోక్ సభలో అడుగుపెట్టే వారిలో మాజీ సీఎంలు శివరాజ్సంగ్, బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారితోపాటు సినీనటులు కంగనా, సురేష్ గోపి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 10, ఆంధ్ర ప్రదేశ్ నుంచి 13 మంది కొత్తవారు ఉండడం విశేషం.

Advertisment
తాజా కథనాలు