దక్షిణ భారతంలోనే కాదు…ఉత్తరభారతంలోనూ ఎండలు మండిపోతున్నాయి. బీహార్ లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. ఎండలకు వడగాల్పులు తోడవ్వడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. ఉత్తరాది భాగం మినహా పాట్నాతో పాటు మిగిలిన జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఉక్కపోత, వేడిగాలుల బీభత్సం కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజస్థాన్ నుండి వస్తున్న వేడి గాలి, తేమ లేకపోవడం, మేఘాలు లేకపోవడం మొదలైన వాటి కారణంగా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలలో వేడి గరిష్టంగా ఉందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..బీహార్లో భానుడి ప్రతాపం…హీట్ వేవ్తో 16మంది బలి..!!
బీహార్ లో గత రెండు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పులు తీవ్రంగా వీస్తుండటంతో...16మంది మరణించారు. వేసవి తాపానికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు విలవిలాడుతున్నారు. అర్వాల్లలో నలుగురు, ఔరంగాబాద్లో ముగ్గురు, భోజ్పూర్లో ఇద్దరు, జెహనాబాద్, జముయి,భాగల్పూర్లలో ఒక్కొక్కరు సహా మొత్తం 16 మంది హీట్ స్ట్రోక్ కారణంగా మరణించారు. మరణించిన వారిలో ఇంజనీర్, మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు.
Translate this News: