BREAKING: 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా

తెలంగాణలో 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ కు పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో తమ పదవులకు రాజీనామా చేశారు.

New Update
BREAKING: 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా

తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవికి ఈరోజు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ కు పంపారు. అలాగే తాజాగా ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు కూడా రాజీనామా చేశారు.

రాజీనామా చేసింది వీరే..

1. సోమ భరత్ కుమార్
చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్

2. జూలూరి గౌరీ శంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

3. పల్లె రవి కుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్

4. డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ

5. మేడె రాజీవ్ సాగర్
చైర్మన్, TS Foods Corporation

6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ.

7. గూడూరు ప్రవీణ్
చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్.

8. గజ్జెల నగేష్
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్.

9. అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్.

10.రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్.

11. వలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ.

12. వై సతీష్ రెడ్డి
చైర్మన్,

13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

14. రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.

15. జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్.

Advertisment
తాజా కథనాలు