Assam : 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చెరువులో పడి నిందితుడు మృతి!

అస్సాంలో నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రిక్రియేషన్ కోసం ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను ఘటన స్థలానికి తీసుకెళ్లగా.. తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో పడి చనిపోయినట్లు ఎస్పీ స్వప్ననీల్ తెలిపారు.

Assam : 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చెరువులో పడి నిందితుడు మృతి!
New Update

Assam Gang Rape : కోల్‌కతా ఘటన మరవకముందే అస్సాంలో మరో దారుణం వెలుగు చూసింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ట్యూషన్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అఘాయిత్యం చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డు పక్కన విసిరేసి వెళ్లారు నిందితులు. బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఘటనతో అస్సాం అట్టుడికిపోయింది. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకు దిగారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను అరెస్టు చేశారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నిందితుడు చెరువులో దూకాడు. తెల్లవారుజామున మృతదేహం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ తెలిపారు.

Also Read : నెలలోపే ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?

#assam-gang-rape
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe