చైనాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి!

చైనాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్‌యాంగ్ సిటీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. గాయపడిన 6 గురిని సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించారు.

New Update
చైనాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి!

చైనాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 11 మంది చనిపోయారు. తూర్పు చైనా అంతటా, టైఫూన్ కామీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్‌యాంగ్ సిటీలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 6 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కామీ తుపాను చైనాను తాకడానికి ముందు ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలకు 34 మంది వరకు మరణిచారు.

Advertisment
తాజా కథనాలు