ముంబై విమానాశ్రయంలో రూ.11 కోట్ల విలువైన గోల్డ్, విదేశీ కరెన్సీ స్వాధీనం!

ముంబై విమానాశ్రయంలో గత 4 రోజుల్లో రూ.11 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలు పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందటంతో కస్టమ్స్ అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలు చేపట్టారు.దీంతో నలుగురు వీదేశీయుల నుంచి భారీ మొత్తంలో గోల్డ్,కరెన్సీని స్వాాధీనం చేసుకున్నారు.

New Update
ముంబై విమానాశ్రయంలో రూ.11 కోట్ల విలువైన గోల్డ్, విదేశీ కరెన్సీ స్వాధీనం!

మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీని ప్రకారం జూలై 10 నుంచి జూలై 14 వరకు కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు.
11 కోట్ల విలువైన 13.24 కిలోల బంగారం, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. 45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ప్రయాణికుల బట్టల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఏడుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. గత 4 రోజుల్లో మొత్తం రూ.11 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలు పట్టుబడ్డాయి. ఈ విధంగా వారు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు