YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!

షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. సొంత ప్రయోజనాల కోసమే షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు. షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు.

New Update
YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!

Shock To Sharmila: తెలంగాణ ఎన్నికల్లో YSRTP పోటీ చేస్తుందని తెలిపిన షర్మిల(Sharmila).. ఇటీవలే తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్(Congress) పార్టీకి ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు, ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న తమకు షర్మిల అన్యాయం చేసిందంటూ విమర్శలు చేశారు. ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు ఆ పార్టీ కీలక నేతలు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?

షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టారని అన్నారు YSRTP కీలక నేత గట్టు రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో తలబడుతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులకు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని.. తామంతా షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు.. షర్మిల రాజకీయాలకు పనికిరాదని ఆరోపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యచరణ చెబుతాం అని అన్నారు.

వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసిందని ఆ పార్టీ నాయకురాలు సత్యవతి అన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అంటే పార్టీలో చేరి పాదయాత్రలో పాల్గొనాన్నని.. వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారు అందరిని మోసం షర్మిల చేసిందని ఆరోపించారు. షర్మిల ఎవర్ని గౌరవించలేదు సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళిందని, పాదాల మీద కాదు మా అందరి శవాల మీద నడిచేందుకు సిద్ధమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటి చేసిన ఓడగొడుతామని తేల్చి చెప్పారు.

బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిల ఖబర్దార్ అని హెచ్చరించారు గణేష్ నాయక్. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి షర్మిల తెలంగాణకు వచ్చిందని ఆరోపించారు. షర్మిల తెలంగాణలో ఎక్కడా పోటీ చేసిన రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: నామినేషన్స్ గడువు పెంచండి.. ఈసిని డిమాండ్ చేసిన కేఏ పాల్

Advertisment
తాజా కథనాలు