YS Jagan: 45 రోజుల్లో 30 మందికి పైగా హత్యలు.. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు.. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. టీడీపీ పాలనపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని.. తమ పార్టీ శ్రేణులపై దాడులు చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

New Update
YS Jagan: 45 రోజుల్లో 30 మందికి పైగా హత్యలు.. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు.. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. టీడీపీ పాలనపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, గత 45 రోజులుగా అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోంది. అంతులేని దారుణాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం. వైయస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోంది'.

'30 మందికి పైగా హత్యలు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. 560 చోట్లకు పైగా ప్రైవేటు ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. ప్రైవేటు ఆస్తులను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేశారు. చివరకు తోటలు కూడా విధ్వంసం చేస్తున్నారు'.

'చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్‌ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్‌ పేరిట హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలి. అన్న అన్ని వివరాలు రాసినట్టు.. అందులో లోకేష్‌ స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా.. రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. తమ పార్టీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా.. ఏ చర్యా తీసుకోవద్దని నిర్దేశించాడు. ఆ రెడ్‌బుక్‌ను రాష్ట్రంలో అంతటా హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించడమే కాకుండా, దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాడు. ఆ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పని చేస్తోంది'.

'గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం'.

'రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకొండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు'.

'ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి'.

'ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకొండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో, అండగా నిలవండి' అని విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు