Jagan: ఈ విషయాన్ని మాత్రమే గుర్తించండి.. నేతలకు జగన్‌ హెచ్చరిక..!

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండన్నారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని.. ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని కామెంట్స్ చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు సూచించారు.

New Update
Jagan: ఈ విషయాన్ని మాత్రమే గుర్తించండి.. నేతలకు జగన్‌ హెచ్చరిక..!

 YS Jagan : వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వరుసగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా,మరో సారి సమావేశం నిర్వహించిన జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు కేవలం ఇంటర్వెల్‌ మాత్రమేనని.. శకుని పాచికలనే సబ్జెక్ట్‌ కేవలం ఇంటర్వెలేనని అన్నారు. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు ఓడిపోతారన్నారు.

Also read: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిస్తుందని పేర్కొన్నారు.  ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండన్నారు. మనం ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని కామెంట్స్ చేశారు. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతామన్నారు.

Also Read: వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక.!

మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశామని..ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై చాలా మంది ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నారని.. అవన్నీ తన దృష్టికి తీసుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని.. బాధిత కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని.. త్వరలో తాను వచ్చి కార్యకర్తలను కలుస్తానన్నారు.

Advertisment
తాజా కథనాలు