YS Jagan Takes Sensational Decision To Botsa Satyanarayana : ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ (YCP) అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనమండలి పక్ష నేతగా బొత్సను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆ పార్టీ శాసనమండలి పక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి.. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో బొత్స వైసీపీ పక్ష నేతగా ఎన్నికైతే ఆయనకు కేబినెట్ హొదా దక్కనుంది. అసెంబ్లీలో పదో వంతు ఎమ్మెల్యే సీట్లు దక్కకపోవడంతో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Supreme Court : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట
AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!
ఇటీవల విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు మరో కీలక పదవి దక్కనుంది. ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది.
Translate this News: