AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్‌ పెట్టిన షర్మిల ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

New Update
AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!

MLA Kondeti Chitti Babu Joined Congress Party: వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రతిపక్ష్యాలుగా వీరు ఇలా ఉంటే..ఏపీ సీఎం జగన్ సొంత చెల్లి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్‌, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

Also Read: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా?

తాజాగా, వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామ చేసిన పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో టికెట్ దక్కని ప్రస్తుత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మొగ్గచూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు