కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం అయిన పత్రికా రంగం అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇటీవల కాలంలో పత్రికా రంగం తన బాధ్యతలు, ప్రమాణాలను విస్మరిస్తూ అవాంఛనీయమైన ధోరణులకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నామని పేర్కొన్నారు. చట్టప్రకారం శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం నిషిద్ధమని గుర్తుచేశారు. కానీ పత్రికా రంగంలోకి వాటికి ప్రవేశం సులువైందన్నారు. దీని పర్యవసానంగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్లు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలైన ఇతర వ్యవస్థలను శాసించే స్థితికి చేరుకున్నాయని వివరించారు.
పూర్తిగా చదవండి..కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియాలో పెడధోరణులు: విజయసాయిరెడ్డి
కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: