YCP: వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం మార్గంలో వైసీపీ ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. దాదాపు 2 కోట్ల డబ్బు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడౌను మొత్తం తనిఖీ చేసేంతవరకు కదిలేది లేదని భీష్ముంచి కూర్చున్నారు.

New Update
YCP: వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ

YCP: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద వైసీపీ ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు స్వాదీనం చేసుకున్నారు. రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రిని నిల్వ చేసుకొని లారీ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గాజులు మన్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గోడౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గోడౌన్ తాళాలు తీసి మొత్తం పరిశీలించేంతవరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు.

Also Read: ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు.. సమావేశానికి ముగ్గురు సీనియర్లు డుమ్మా..!

ఈ సంధర్బంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణా యాదవ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గోడౌన్  తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టారు. పేపర్లో కథనాలు వస్తున్నా కూడా వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని అన్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని ఇంత భారీగా తరలిస్తున్న వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు