YS Bharati: ‘యాత్ర-2’ మూవీ అప్డేట్.. భారతి పాత్ర ఫస్ట్‎లుక్ రిలీజ్

ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా ‘యాత్ర-2’ చిత్ర బృందం అప్డేట్ అందించింది. ఓ పవర్ఫుల్ డైలాగ్ తో సినిమాలో భారతి క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.

New Update
YS Bharati: ‘యాత్ర-2’ మూవీ అప్డేట్.. భారతి పాత్ర ఫస్ట్‎లుక్ రిలీజ్

YS Bharati: ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా ‘యాత్ర-2’ చిత్ర బృందం అప్డేట్ అందించింది. ఓ పవర్ఫుల్ డైలాగ్ తో సినిమాలో భారతి క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకు రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుదిరిగి చూడడం కూడా నేర్పించలేదు’’ అని భారతి పాత్ర చెప్పే డైలాగ్ ను పోస్టర్ పై రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట వైరలవుతోంది.

ఇది కూడా చదవండి: ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ

యాత్ర ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ డైరెక్షన్ చేస్తున్న తాజా సినిమా ‘యాత్ర 2’. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై వైఎస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాల సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్‌ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘యాత్ర’కు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు మహి.

జగన్‌ ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఏపీలో జ‌రిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. చిత్రంలో సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. భారతి లుక్‌కు తను ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది.

2019లో విడుదలైన ‘యాత్ర’ చిత్రం విశేష జనాదరణ పొందిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 8న దీనికి సీక్వెల్ గా రూపొందిస్తున్న ‘యాత్ర-2’ విడుదల చేయబోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు