Mahalakshmi Card:నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం...అయితే ఈ కార్డు ఉండాల్సిందే..డౌన్ లోడ్ చేసుకోండిలా..!!

తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి ప్రారంభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించాలంటే మహాలక్ష్మీ కార్డు ఉండాల్సిందే.

New Update
TS RTC: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా!

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన మహాలక్ష్మీ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఒక వారంరోజుల పాటు ఎలాంటి కార్డు లేకుండా ఫ్రీగా ప్రయాణంచేయవచ్చు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ సూచించి వెబ్ సైట్ లోకి వెళ్లి తమ నియోజకవర్గాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న 6 గ్యారంటీలకు సంబంధించి కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలి. మహిళలకు రూ. 500గ్యాస్ సిలిండర్ , ప్రతినెలా ఆడవాళ్లకు రూ. 2500 ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందించనుంది.

కాగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కూడా ఒకటి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ పథకాన్ని శనివారం కొత్త ఎన్నికల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళలు, బాలికలు, అమ్మాయిలతోపాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. మొదటివారం రోజులపాటు ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదు. అలాగే అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో తెలంగాణ సరిహద్దు వరకు ఫ్రీగా ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు.

ఈ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విధివిధానాలను ప్రకటించారు. వయస్సుతో పనిలేకుండా అన్ని వయస్సుల మహిళలు, అమ్మాయిలు, బాలికలు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైన ప్రయాణించే ఈ పథకంలో కేవలం ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్ల్ మాత్రమే ప్రయాణించాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. గరడు, స్లీపర్ వంటి బస్సుల్లో ఛాన్స్ లేదు. మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం ద్వారా కలిగే నష్టాన్ని ఆర్టీసీ ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రంలోని ప్రతిజిల్లా, మండల, కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అర్హులని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: నా ఫోన్‌ హ్యాక్‌ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు