/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T160609.086.jpg)
కఫం అనేది శ్వాసకోశ మార్గాల శ్లేష్మ స్రావం. శ్లేష్మంలో 95% నీరు, 3% మ్యూకిన్-యాంటీబాడీస్తో వంటి ప్రోటీన్లు, 1% ఉప్పు తదితరాలు ఉంటాయి. మ్యూకిన్ బిందువులు నీటిని గ్రహిస్తాయి. అది శ్లేష్మ గ్రంథుల నుంచి విడుదలైన మూడు సెకన్లలో వందల రెట్లు ఉబ్బుతాయి. శ్లేష్మ తంతువులు క్రాస్ లింక్లను ఏర్పాటు చేయడం వల్ల కఫం సాగే జెల్గా మారుతుంది. అందుకే అది కఫం అంత చిక్కగా జిగటలా కనిపిస్తుంది.
రోజూ మీకు తెలియకుండానే 1.5 లీటర్ల కఫాన్ని మింగేస్తారు. మీకు జలుబు లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్నా.. మీ కఫం చిక్కగా, ముదురు రంగులో ఉండవచ్చు. బ్యాక్టీరియా, వైరస్లు, తెల్ల రక్త కణాల, యాంటీబాడీల వల్ల కఫం అలా మారుతుంది. అయితే, శ్లేష్మాన్ని మింగడం మంచిదా? కాదా అనే సందేహంపై భిన్న వాదనలు ఉన్నాయి.
ఊపిరితీత్తుల్లోని వాయు మార్గానికి మాత్రం ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే.. మన ముక్కులోని రెండు నాసిక కుహరాలు కలిపి 150 చదరపు సెంటీమీటర్లు ఉంటాయి. వాటి గోడలపై మడతలు ఉంటాయి. మనం పీల్చే గాలిలో 80 శాతం మలినాలు ఇక్కడే పిల్టర్ అవుతాయి. గోడలపై వెంటుకల తరహాలో ఉండే సిలియా మలినాలను అడ్డుకుంటుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంటుంది. కాబట్టి, ప్రమాదకర దుమ్మూ, దూళి శ్లేష్మానికి అంటుకోవు. శ్లేష్మం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. నిద్రలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మంలో మృతకణాలు, దుమ్ము, శిధిలాలు ఉంటాయి. అది కడుపులోకి వెళ్లిన తర్వాత రీసైక్లింగ్ అవుతుంది. ముక్కు రోజుకు 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తులు రోజుకు దాదాపు 50 మిల్లీలీటర్ల కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి.
కఫంలో బ్యాక్టీరియా ఉంటుందని, మింగడం వల్ల అది శరీరం మొత్తం పాకేస్తుందని భావిస్తారు. అలాగే, మన ఊపిరితీత్తుల్లో కఫాన్ని మరింత పెంచేస్తుందని అంటున్నారు. అయితే, నిపుణులు దీనిపై స్పందిస్తూ.. కఫం విషపూరితం కాదని, మింగడం వల్ల ఎలాంటి హాని కలగదని తెలిపారు. కడుపులోకి వెళ్లిన కఫాన్ని శక్తివంతమైన యాసిడ్లు, ఎంజైమ్లు నాశనం చేస్తాయి. కాబట్టి, అందులోని బ్యాక్టీరియా ఇతర శరీర భాగాలకు చేరడం అసాధ్యం.
ఛాతిలో భారంగా ఉండి, దగ్గు వస్తున్నట్లయితే.. అది చాతి ఇన్ఫెక్షన్కు సంకేతం. గొంతులోని కఫం ఊపిరితిత్తుల నుంచి పుట్టిందా? లేదా నాసికా కుహరం వెనుక నుంచి అక్కడికి జారిందా? అనేది నిర్ధారించడం చాలా కష్టం. గొంతులో కిచకిచలాడే శ్లేష్మం ఎక్కడ నుండి వచ్చినా ఛాతీలో ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే, దగ్గు వల్ల సమస్య ఏమిటనేది స్పష్టంగా తెలుసుకోవచ్చట. చాలా మంది పాలు, పాల ఉత్పత్తులు అదనపు శ్లేష్మానికి కారణమవుతాయని నమ్ముతారు. కాబట్టి గవత జ్వరం, ఆస్తమా ఉన్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.