/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/love-story--jpg.webp)
Vizag triangle Love story: ఫేక్ లవ్వొ.. టైమ్ పాస్ లవ్వొ.. ధైర్యం లేని లవ్వొ.. కొవ్వు పట్టిన లవ్వొనన్నది పక్కన పెడితే ఇటివల కాలంలో ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో తరహా లవ్ స్టోరీలు కుప్పలుతెప్పలుగా వినిపిస్తున్నాయి. మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి కూడా! ఒకరిద్దరితో ప్రేమ వ్యవహరం నడపడం.. ఒక లవర్ ఉండగానే మరో ప్రేమని వెతుక్కోవడం.. అందులో ఒకరిని చీట్ చేయడం లాంటివి చూస్తున్నే ఉన్నాం. అయితే విశాఖలో జరిగిన కథ కాస్త భిన్నం. ఇద్దరిని ఓకే సమయంలో ప్రేమించిన యువతి.. ఆ ఇద్దరిలో ఒకరిని కాకుండా మరో వ్యక్తిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. అనేక మలుపులు తిరిగిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అటు తిరిగి ఇటు తిరిగి విషాదంగా ముగిసింది. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
ఒకటే కథ.. రెండు ఆత్మహత్యలు:
విశాఖ(vizag) గోపాలపట్నంలో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతమైంది. ఒకే సారి ఇద్దరినీ ప్రేమించి సీక్రెట్గా మరొకరిని పెళ్లి చేసుకుంది 17ఏళ్ల బాలిక.పెళ్లి అయిన తరువాత కూడా ప్రియులుతో చనువుగా ఉంటూ వచ్చింది. అనుమానం వచ్చిన భర్త ఆమెను ప్రశ్నించాడు. అదే సమయంలో ప్రియులు ఇద్దరు ఇంటికి వచ్చి ఎవరితో ఉంటావో తేల్చుకో అంటూ గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఇద్దరి ప్రియుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు యువతి రాసిన సూసైడ్ లేటర్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్న విశాఖ ప్రజలు ముక్కున వెలేసుకుంటున్నారు.
ఎందుకిలా జరిగింది?
నిజానికి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు.. 'క్వాడ్రపుల్' (Quadruple) ప్రేమ కథ! అంటే నలుగురు వ్యక్తుల వ్యథ. పెళ్లి చేసుకున్నవాడితో కలిపి నలుగురు అయ్యారు. అంటే ఆ ముగ్గురు అబ్బాయిలు ఆమెను ఇష్టపడ్డారు. అందులో ఒకరితో ఆమెకు పెళ్లి జరిగిపోయిన తర్వాత కూడా మిగిలిన ఇద్దరు బాలికని మరిచిపోలేకపోయారు. అందుకే ఇంటికి వెళ్లి గొడవ చేశారు. అప్పటికే ఈ విషయం ఇంట్లో భర్తకు తెలిసిపోవడం బాలికకు గిల్ట్ ఫీలింగ్ కలిగేలా చేసింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడపడమే ఆమె కొంపముంచింది.
అసలు ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ప్రేమ అన్నది చాలా సెన్సిటివ్ మేటర్. రియాల్గా లవ్ చేసిన వాళ్లని చీట్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీవితంతం ఉంటుంది. ఆ యువతి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో తెలియదు.. పోని జరిగిందేదో జరిగిపోయిందని ఈ ఇద్దరు యువకులకు అసలు విషయం చెప్పేసి ఉన్నా బాగుండేది. వీళ్లిద్దరు అయినా తగ్గి ఉంటే ఇలా రెండు ప్రాణాలు పోయేవి కావు. నిజానికి చెప్పే వాళ్లు వంద చెబుతారు కానీ.. అనుభవించేవాళ్లకే ఈ బాధలు తెలుస్తాయి.. ఆ సందర్భంతో మనిషి ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించలేకపోవడంతోనే ఈ తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ లాజిక్ కంటే ఎమోషన్సే ఎక్కువగా మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. దీని నుంచి బయటపడితేనే లైఫ్ అన్న విషయాన్ని గుర్తించగలిగితే ఈ తరహా ప్రేమ కథలు విషాదాంతం అవ్వకుండా ఉంటాయి.