Vijayasai Reddy: ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా..పురందేశ్వరిపై షాకింగ్ కామెంట్స్.!

బీజేపీ పురందేశ్వరిపై వైసీపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!' అంటూ ట్వీట్ చేశారు.

New Update
Vijayasai Reddy: ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా..పురందేశ్వరిపై షాకింగ్ కామెంట్స్.!

ycp Vijayasai Reddy shocking comments on BJP purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పురందేశ్వరి  టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. 'సంస్థాగతంగా బీజేపీని (అంటే తమరున్న పార్టీని) ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!' అని ట్వీట్ చేశారు.

కాగా, వైసీపీ పాలనపై పలుసార్లు ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ముఖ్యంగా లిక్కర్ స్కాం చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. దీంతో ఆమెపై రివర్స్ కౌంటర్లు వేస్తూ దుయ్యబట్టారు. బీజేపీకి సపోర్ట్ చేయాల్సింది పోయి టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

Also Read: చంద్రబాబుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం..రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.!

ఇదిలా ఉండగా..చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. విపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియలో చోటుచేసుకున్న విధాన పరమైన లోపాలను బీజేపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు లభించాలని, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఆయనసై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు