Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..!

వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షిస్తామన్నారు విజయసాయిరెడ్డి. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని..నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తామని కామెంట్స్ చేశారు. పొరపాట్లను సరిదిద్దుకొని..ముందుకు సాగుతామన్నారు.

Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..!
New Update

Vijayasai Reddy: వైసీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుంభాక విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రవ్యాప్తంగా.. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పు శిరోధార్యం అని కామెంట్స్ చేశారు.

Also read: నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు.. పవన్ పై చిరంజీవి భావోద్వేగం.!

నెల్లూరు నగర సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షిస్తామన్నారు.. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని..నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పొరపాట్లను సరిదిద్దుకొని..ముందుకు సాగుతామన్నారు విజయ్ సాయి రెడ్డి.

#vijayasai-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe