Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..!

వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షిస్తామన్నారు విజయసాయిరెడ్డి. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని..నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తామని కామెంట్స్ చేశారు. పొరపాట్లను సరిదిద్దుకొని..ముందుకు సాగుతామన్నారు.

New Update
Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..!

Vijayasai Reddy: వైసీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుంభాక విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రవ్యాప్తంగా.. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పు శిరోధార్యం అని కామెంట్స్ చేశారు.

Also read: నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు.. పవన్ పై చిరంజీవి భావోద్వేగం.!

నెల్లూరు నగర సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షిస్తామన్నారు.. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని..నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పొరపాట్లను సరిదిద్దుకొని..ముందుకు సాగుతామన్నారు విజయ్ సాయి రెడ్డి.

Advertisment
తాజా కథనాలు