/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vijay-sai-jpg.webp)
Vijayasai Reddy: వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని ఆయన వీడుతున్నట్టుగా కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, దీనిపై ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.
I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024
వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని.. వైసీపీలోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. వైసీపీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.
 Follow Us