వారంతా బాణాసంచా ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు.. రోజులాగే విధులకు వచ్చారు. తోటి కార్మికులతో ముచ్చటిస్తూ పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం అందరూ లంచ్ చేస్తూ మాట్లాడుకున్నారు. సరదగా గడిపారు. మళ్లి పనిలో బిజీ ఐపోయారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా మృత్యువు దాడి చేసింది. ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అందరూ బయటకు పరుగులు తీశారు. మరికొందరు మాత్రం ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. మంటలకు ఆహుతయ్యారు. బయట పడే దారిలేక మంటల్లోనే కాలిపోతున్న శరీరాన్ని రక్షించుకోలేక సజీవ దహనమయ్యారు. చివరి క్షణంలో కుటుంబాన్ని, పిల్లలను తలుచుకుంటూ ఈ లోకాన్ని వీడారు. తమిళనాడులో ఈ తరహా ఘటన జరగడం ఇది వారంలో రెండోసారి.
పూర్తిగా చదవండి..Fire Cracker Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9మంది మృతి..! వరుసగా రెండో ఘటన
తమిళనాడులోని అరియలూర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఘటన ఇది. మైలాడుదురైలో అక్టోబర్ 5న జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వరుస పెట్టి బాణాసంచా ఫ్యాక్టరీల్లోనే ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Translate this News: