ఆపరేషన్‌ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్‌ భూమన!

భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు.

New Update
ఆపరేషన్‌ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్‌ భూమన!

భక్తుల రక్షణ కోసమే వారి చేతికి కర్రలు అందిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదని టీటీడీ ఛైర్మన్ అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన చిన్నారి లక్షిత ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి వారు గురువారం మీడియా ముందు వివరించారు.

భక్తులకు భద్రత కల్పిస్తూనే ఆపరేషన్ చిరుత చేపడుతున్నామని అన్నారు. చిరుత సమాచారంపై నిఘాకోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టామని చెప్పారు.ఎలుగు బంట్లను బోనుల్లో పట్టడం కుదరదు..వాటి కోసం ప్రత్యేకంగా వలలు పన్ని వాటని పట్టుకోవాలి.

అలా చేయాలి అంటే దానికి నిపుణులు కావాలి. వారిని శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి పిలిపిస్తున్నామని ఆయన వివరించారు. డ్రోన్‌ టీం ను కూడా రప్పిస్తున్నాట్లు తెలిపారు. తిరుమల ఎస్వీ జూ పార్క్‌ నుంచి చిరుతలను తెచ్చి బోన్లలో పెట్టి వాటిని మీడియాకు చూపుతున్నామని ట్రోల్‌ చేస్తున్నారు. ఇక నైనా అలాంటి ట్రోలింగ్స్ ఆపండి. చిరుత బోనులో చిక్కే సమయంలో సీసీ టీవీలో రికార్డు అయిన విజువల్స్‌ ని కూడా మీడియాకు అతి త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వివరించారు.

గత సోమవారం తిరుమల కొండ పై నాలుగేళ్ల చిన్నారి లక్షితను చిరుత హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులతో కలిసి నడక మార్గంలో కొన్నిచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నడక మార్గంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతినిస్తుంది.

భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ, అటవీ అధికారులు నడక మార్గంలో వెళ్లే భక్తుల చేతికి కర్రలు అందించారు. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తుంది. ఈ విషయం గురించి స్పందించిన టీటీడీ నూతన ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు. చిన్నారి లక్షిత ఘటన తరువాత కాలినడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.

మోకాలి మిట్ట, లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం వద్ద బోన్లు ఉంచగా మూడు రోజుల క్రితం ఒక పులి బోనులో చిక్కగా ఈ తెల్లవారుజామున ఒక మగ చిరుత బోనులో చిక్కినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే చిరుతలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 300 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

మరో 200 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇందుకు గానూ శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్‌ నిపుణులను పిలిపిస్తున్నామని వివరించారు

Advertisment
తాజా కథనాలు