హైదరాబాద్ ఐటీకారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు JNTU-WAVEROCK మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈనెల 31 నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ప్రత్యేక బస్సును మహిళ ప్రయాణికులు వినియోగించుకుని క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..మహిళా ఉద్యోగులకు శుభవార్త…ఐటీ కారిడార్లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు…!!
కొన్నాళ్లుగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఓవైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవడంతోపాగటుగా..మరోవైపు ప్రయాణికులను ఆకర్షించేలా ఎన్నో మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ..తాజాగా ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళలకు శుభవార్తను అందించింది.
Translate this News: