Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) నేరుగా ఆందోళనకు దిగారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. మరో వైపు ఎంపీపీ అనుచరులు, వైసీపీ (YCP) శ్రేణులు బిల్డింగ్ కూల్చివేయవద్దంటూ భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Also Read: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!