Tiger attack: అడవి నుంచి బయటకు వచ్చిన పులి..ముగ్గురు పై దాడి!

 ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ నుండి  వచ్చిన పులి పొలంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల పై దాడి చేసింది. పొలంలో పని చేస్తున్న తోటి కూలీలు పులిని రాళ్లతో కొట్టడంతో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.

New Update
Tiger attack: అడవి నుంచి బయటకు వచ్చిన పులి..ముగ్గురు పై దాడి!
ఆదివారం ఉదయం తహసీల్ ప్రాంతంలో ఒక పులి.. దుద్వా టైగర్ రిజర్వ్‌లోని బఫర్ జోన్‌ అడవి నుండి బయటకు వచ్చింది. కొరియా గ్రామానికి చెందిన మనోజ్ వర్మ, కమలేష్ పొలంలో చెరకు తొక్కలు తీస్తుండగా..పులి వారిపై దాడి చేసింది.చెరకు తొక్కుతున్న మిగిలిన  కూలీలు పులి నుంచి ఇద్దరినీ రక్షించి అటవీ శాఖ బృందానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పులిని అడవిలోకి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘటనా స్థలంలో భారీగా గుమికూడిన జనాన్ని చూసిన పులి మరోసారి  చెరకు తోట నుంచి బయటకు వచ్చి ఓ యువకుడిపై దాడి చేసింది. ఘటనా స్థలంలో ఉన్న జనం పులిని రాళ్లతో కొట్టగా అది అడవిలోకి పారిపోయింది.

ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలపై దాడి చేసినట్లు సమాచారం అందిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి దాడి గురించి తెలిసి అక్కడకి చాలా మంది ప్రజలు గుమిగూడారని వారు అన్నారు. మా బృందంతో కలసి  పులిని అడవి నుండి తరిమికొట్టేందుకు ప్రయత్నాలు చేశామని.ఒక్కసారిగా పులి ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచిందని తెలిపారు. ప్రస్తుతం పులి అడవిలోకి వెళ్లిందని.. పొలాల్లోకి వెళ్లే కూలీలు గుంపులుగా ఉండాలన్నారు.

Advertisment
తాజా కథనాలు