/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/river-1-1.jpg)
Kakinada: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
Also Read: పంట పొలాల్లో వజ్రాల వేట.. రైతుకు దొరికిన వజ్రం.. ఖరీదు తెలిస్తే అవాక్కవుతారు..!
వాహనదారులను కెరటాలు ముంచేస్తున్నాయి. ఒక్కసారిగా నీటిమట్టం పెరిగడం, సముద్రం ముందుకు రావడంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే, కొందరు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు.