RSS Meet: రాంచీలో ప్రారంభం కానున్న ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు.. ఎజెండా ఇదే! 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా ప్రావిన్స్ ప్రచారక్ సమావేశం జూలై 12 నుండి 14 వరకు రాంచీలో జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఆల్‌ ఇండియా పబ్లిసిటీ చీఫ్‌ సునీల్‌ అంబేకర్‌ అందించారు. 

RSS Meet: రాంచీలో ప్రారంభం కానున్న ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు.. ఎజెండా ఇదే! 
New Update

RSS Meet:  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత రాష్ట్ర ప్రచారక్ సమావేశం జార్ఖండ్ రాజధాని రాంచీలో జూలై 12 నుండి 14 వరకు జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ప్రచారకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. దేశంలోని 46 ప్రావిన్సులకు చెందిన ప్రచారకులు, వారి సహచరులతో ఈ సమావేశం జరగనుంది.  

RSS Meet: రాబోయే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా పబ్లిసిటీ హెడ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ప్రణాళికలో, ఏడాది పొడవునా శాఖల వారీగా నిర్వహించే పనుల గురించి చర్చిస్తామని తెలిపారు.  ఆర్ఎస్ఎస్ లో   చేరే కొత్త వ్యక్తుల కోసం మేధోపరమైన ఆలోచనలో విభిన్న ప్రయోగాలపై చర్చలు కూడా ఉంటాయని చెప్పారు. 

వివిధ సంస్థల నుంచి సహాయం ఎలా పొందాలనే దానిపై చర్చ..

RSS Meet: అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడల్లా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని అంబేకర్ అన్నారు. సంఘ్ శత జయంతి సంవత్సరం కూడా దగ్గరలోనే ఉంది. 2025లో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు.  దీని నిర్వహణ కోసం వివిధ సంస్థల నుండి ఎలా సహాయం పొందాలనేది కూడా కెహెర్చిస్తారు.  సమావేశంలో సామాజిక మార్పునకు సంబంధించిన ఐదు కార్యక్రమాలను శాఖల స్థాయికి, సమాజానికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.

 ప్రతి సంవత్సరం మూడు ముఖ్యమైన సమావేశాలు

సునీల్ అంబేకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో సమాజంలోని శక్తిని ఏకం చేయడం ద్వారా సామాజిక మార్పు కోసం ఏవిధంగా కలిసి పని చేయాలనే అంశంపై కూడా చర్చిస్తామన్నారు. సామాజిక జీవితంలోని అనేక ఇతర అంశాలు కూడా చర్చిస్తారు.  సంఘ్ ప్రతి సంవత్సరం మూడు ముఖ్యమైన సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో ఇటీవలే పూర్తయిన శిక్షణా తరగతులు, వివిధ సబ్జెక్టులు, వాటి అమలుతో సహా సంఘ్‌లోని అన్ని కార్యవర్గాల పనితీరుపై చర్చించనున్నారు.

శాఖల సంఖ్యను లక్షకు పెంచడం లక్ష్యం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 73 వేల శాఖలు నిర్వహిస్తున్నట్లు అంబేకర్ తెలిపారు. వచ్చే శతాబ్ది సంవత్సరంలో ఈ సంఖ్యను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

#rss-meet #rss
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe