Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్)ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!
New Update

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్)ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5 శాతం మధ్యంతర భృతి (ఐ ఆర్ ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అక్టోబర్ మధ్య నాటికి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందని, ఆ తర్వాత ఎస్ఓపీల ప్రకటనలు నిలిపివేయాలని అధికార పార్టీ భావిస్తోంది.

G.O.159- PRC-Appointment-2023

IR_GO

కేంద్ర ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులే ఎక్కువగా సంపాదించుకుంటారని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు అందేలా ప్రొఫెషనల్ రెగ్యులేషన్ కమిషన్ (పీఆర్సీ)ని త్వరలోనే ప్రకటిస్తామని గతంలో కేసీఆర్ తెలిపారు. సంపద సృష్టిలో తెలంగాణ విజయం సాధించిందని, ప్రయోజనాలను అన్ని వర్గాలతో పంచుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. త్వరలో ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాల పరిధిని విస్తరించడంతో పాటు మరెన్నో కార్యక్రమాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధికారంలో కొనసాగుతుందని, మరింత పెద్ద మెజారిటీ సాధిస్తుందని కెసిఆర్ అన్నారు. ఈసారి బీఆర్ఎస్ సంఖ్య ఏడెనిమిది స్థానాలు మెరుగవుతుందని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి బీఆర్ ఎస్ బీ టీమ్ కాదని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ALSO READ: ‘ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావ్..’ కేటీఆర్‌ మాయమాటలు చెప్పిండు..!

#telangana-prc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe