మాతో టచ్ లో మంత్రి కోమటిరెడ్డి.. ఆ 5 గురు మంత్రులు కూడా: బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో ఐదుగురు తెలంగాణ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్ తో కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారని.. ఆయనే షిండే అని అన్నారు.

New Update
మాతో టచ్ లో మంత్రి కోమటిరెడ్డి.. ఆ 5 గురు మంత్రులు కూడా: బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే షిండే అని అన్నారు. మా పార్టీ హై కమాండ్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) టచ్‌లో ఉన్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీని కలిసి షిండే పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పలేదా? అని ప్రశ్నించారు. బిడ్డా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూలగొడుతాం అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తమతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో ఐదుగురు మంత్రులు టచ్ లో ఉన్నారని ప్రకటించారు. దీంతో మహేశ్వర్ రెడ్డి చెబుతున్న ఆ ఐదుగురు మంత్రులు ఎవరన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Also Read: కేసీఆర్‌, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..

Advertisment
తాజా కథనాలు