తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కు తమిళిసై సూచించారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం లేదని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. నిబంధనల ప్రకారం.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడానికి అర్హత లేదన్నారు గవర్నర్. ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా తమిళిసై సూచించారు.
గతంతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తో కాస్త సఖ్యత కుదిరందన్న ఇటీవల పొలిటికల్స్ సర్కిల్స్ లో వ్యక్తమైంది. ఈ తరుణంలో గవర్నర్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.
గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం, రాజ్ భవన్ ను మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. పూర్తి వివరాలతో మరో సారి ఈ ఇరువురు నేతల అభ్యర్థిత్వాలను ప్రభుత్వం సిఫార్సు చేస్తుందా? లేక కొత్త పేర్లను పంపిస్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
this is an updating story