కాంగ్రెస్ ధీమా.. ఎమ్మెల్యేల క్యాంప్ కోసం 3 బస్సులు రెడీ!

గెలిచిన అభ్యర్థులను వెంటనే క్యాంప్ కు తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో మూడు బస్సులను సిద్ధం చేసింది. గెలిచిన అభ్యర్థులను తొలుత హైదరాబాద్, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించనుంది కాంగ్రెస్.

New Update
కాంగ్రెస్ ధీమా.. ఎమ్మెల్యేల క్యాంప్ కోసం 3 బస్సులు రెడీ!

గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కౌంటింగ్ ముగియగానే క్యాంప్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ లోని హోటల్ తాజ్‌కృష్ణాలో 3 బస్సులు రెడీ చేసినట్లు సమాచారం. ఇదే హోటల్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బస చేశారు.అభ్యర్థులు గెలిచిన వెంటనే హైదరాబాద్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో బెంగళూరుకు తరలించనున్నారు. ఇప్పటికే ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓ ఇంఛార్జిని నియమించింది కాంగ్రెస్. వీరు కాంగ్రెస్ హైకమాండ్, అభ్యర్థుల మధ్య సమన్వయం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణ బాద్‍షా ఎవరు..? కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు