Voters: ఓటర్ల జాబితా రెండో సవరణ... ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఘట్టం!

శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం రెండో దశ ముగిసింది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య పెరిగింది.

New Update
Voters: ఓటర్ల జాబితా రెండో సవరణ... ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఘట్టం!

Voter Registration: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఇవాళ్టి(సెప్టెంబరు, 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రక్రియ(ఫారం-6), ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారు, చిరునామా మారిన వారి పేర్లు తొలగించే ప్రక్రియ(ఫారం-7), ఓటర్ల జాబితాలో వివరాలలో సవరణలు చేసే ప్రక్రియ (ఫారం-8) కింద అభ్యర్థనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. మొత్తం రాష్ట్రంలో ఈ నెల 18 వరకు-కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు, వివరాల సవరణకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 4న తుది జాబితా వెల్లడించనున్నారు. 2023 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ చర్యలు ఆరంభించింది.

అధికారుల కష్టం వల్లే:
అలాగే ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 14.72 లక్షలమంది కొత్తగా ఓటర్లుగా నమోదవగా.. 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షలమంది ఓటర్ల వివరాలలో మార్పులు చేశారు. ఈ మార్పుచేర్పుల ఫలితంగా ఓటర్ల జాబితాలో మొత్తం 3.13 కోట్లు ఉన్నట్లు, వీరిలో 1.57 కోట్లమంది పురుషులు ఉండగా.. 1.56 కోట్లమంది స్త్రీలు, 2,226 మంది ఇతరులు ఉన్నట్లు తేలింది. దీంతో స్త్రీ, పురుష నిష్పత్తి 994గా, ఓటరు, జనాభా నిష్ఫత్తి (2023 వరకు) 696గా తేలింది. కొత్తగా చేరిన యువ ఓటర్లలో చెప్పుకోదగిన మార్పు కనపించింది.

జనవరి 5, 2023 నాటికి 18-19 ఏళ్ళ వయసున్న ఓటర్లు 2.79 లక్షలుండగా, 19 సెప్టెంబరు నాటికి 6.51 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీవికాస్ రాజ్ నిరంతర పర్యవేక్షణలో 33 జిల్లాల ఎన్నికల అధికారులు రాత్రింబవళ్లు చెమటోడ్చడం వల్లనే ఇది సాధ్యమయింది. ఈ నెల 19 వరకు అందిన దరఖాస్తులన్నింటినీ ఈనెల 27 లోగా పరిష్కరించి ఖరారయిన తుది జాబితాను అక్టోబర్, 4న ప్రకటిస్తారు. అభ్యర్ధనలు, అభ్యంతరాలకు గడువు ముగిసినప్పటికీ, అర్హులైన పౌరులు తమ దరఖాస్తులను ఎప్పుడయినా పంపుకోవచ్చని ఎన్నికల జాబితా సవరించిన ప్రతిసారీ వాటిని పరిష్కరించడం జరుగుతుందని ..తెలంగాణ రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి ఒక పత్రిక ప్రకటనలో చెప్పారు.

ALSO READ: ‘రజాకార్‌’ సినిమా బ్యాన్‌? ముదురుతున్న వివాదం..!

Advertisment
తాజా కథనాలు