TDP: ఉండి నియోజకవర్గ టీడీపీలో తగ్గని అసమ్మతి పోరు..!

ఉండి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పోరు ఏ మాత్రం తగ్గడం లేదు. చిన అమిరం టీడీపీ ఆఫీసు ముందు కార్యకర్తల ఆందోళన చేపట్టారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు.

TDP:  ఉండి నియోజకవర్గ టీడీపీలో తగ్గని అసమ్మతి పోరు..!
New Update

TDP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పోరు మరింత వేడెక్కింది. టికెట్ రఘురామరాజుకు ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరగడంతో రామరాజు వర్గం తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టింది. రఘురామరాజుకు కాకుండా టికెట్ రామరాజుకే ఇవ్వాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.

Also Read: వేసవి వద్దు.. సంక్రాంతి ముద్దు అంటున్న స్టార్స్.. అందరూ అప్పుడే.. 

చిన అమిరం టీడీపీ ఆఫీసు ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ హోరెత్తించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఫ్లకార్డులతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడంటే…

ఇదిలా ఉండగా, నరసాపురం టీడీపీలోనూ అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు ఇప్పుడు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో పలుచోట్ల టీడీపీలో అసమ్మతి మరింత చెలరేగిపోతుంది.

#tdp-ramaraju
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe