వైసిపిది బీసీ యాత్ర కాదు.. బేవర్స్ బస్సు యాత్ర..మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్

టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే వైసిపి విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఈ క్రమంలోనే వైసిపిపై విమర్శలు గుప్పించారు. "వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదు..బేవర్స్ బస్సు యాత్ర.."అంటూ ధ్వజమెత్తారు.

New Update
AP Politics: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న

TDP Buddha Venkanna: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నిటిని ఎత్తివేస్తామని తేల్చి చెప్పారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం దీనిపైనే అనే వ్యాఖ్యనించారు.  ఈ క్రమంలోనే వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Also read : పార్టీ మారే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.!

వైసిపి చేపడుతున్నది బీసీ యాత్ర కాదు బేవర్స్ బస్సు యాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఫుల్..సభలకు జనం నిల్ అంటూ ఎద్దెవ చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా పని లేని మంత్రులేనని ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలోనే టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న అది అవాస్తవం అని తెలిపారు.

Also read: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!

చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తే రాష్ట్రంలో జన సునామీనే అని ధీమ వ్యక్తం చేశారు. పొత్తులపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానికి టిడిపి శ్రేణులంతా కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. రేపటి నుంచి రాజోలు నియోజకవర్గంలో జరిగే నారా లోకేష్ యాత్రలో టిడిపితో పాటు జనసేన కూడా పాల్గొంటుందని వెల్లడించారు. కాగా, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండకపోవచ్చని కామెంట్స్ చేశారు.

Advertisment
తాజా కథనాలు