ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం
తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.