Breaking: తిరుమలలో బోనులో చిక్కిన ఐదో చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్
తిరుమల బోనులో మరో చిరుత చిక్కింది. నరశింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవిశాఖ అధికారులు. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించింది అటవీశాఖ. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. ఇక నడకమార్గం, ఘట్ రోడ్డులలో ఆపరేషన్ కొనసాగుతోంది.
By Trinath 07 Sep 2023
షేర్ చేయండి
Tirumula: చిన్నారిని చంపేసిన చిరుత.. తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం!
Tirumala : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. ముందుగా లక్షిత తప్పిపోయిందని అంతా భావించగా.. పోలీసుల సేర్చ్ ఆపరేషన్లో లక్షిత మృతదేహం నరసింహ స్వామి ఆలయం వద్ద కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక గత జూన్ 23న కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇలా వరుస పెట్టి చిరుతలు దాడి చేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
By Trinath 12 Aug 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి